Posted by The Bible answer for the all misconceptions in Christianity | www.answerofbible.com on Tuesday, 13 June 2017
బైబిల్లో అనేక లేఖనాలు చివరి ప్రవక్త అయిన ముహమ్మద్(స) రాకడను గురించి చెబుతు న్నాయి. ఆయన ఇష్మాయేలు రెండవ కుమారుడైన కేదారు వంశంలో పుట్టి, అరేబియా దేశంలో పారాను ప్రాంతం నుండి తన పదివేల పరిశుద్ధ శిష్యగణంతో రానై ఉన్నారని, జ్వాలా భరితమైన వేరొక ధర్మ శాస్త్రం తీసుకుని రానైయున్నారని ఎంతో స్పష్టంగా అనేక లేఖనాలు ప్రకటిస్తు న్నాయి.
ఆ లేఖనాలను బట్టే యేసు సైతం తన అనంతరం తన కోవకే చెందిన తన వంటి వేరొక ఆదరణకర్త రానై ఉన్నారని ఎంతో స్పష్టంగా ప్రకటించటం జరిగింది. ఆయన ఏదీ తనంతట తాను మాట్లాడక దేవుని వద్ద విన్న విషయాలనే బోధిస్తారని, లోకం మొత్తం ఆయనను చూడదని చెప్పారు.
అంతేకాక యేసు తాను చెప్పటానికి అవకాశం లేక వదిలి వేసిన అనేక విషయాలను ఆయన చెబుతారని, తాను బోధించిన ధర్మాన్ని తన అనుచరులు పూర్తిగా మరచిపోయి ఉన్న సందర్భంలో వేరొక ఆదరణకర్త అయిన ముహమ్మద్ వచ్చి, తాను బోధించిన సమస్త విషయాలను తిరిగి జ్ఞాపకం చేసి దేవుని రాజ్యాన్ని (మతపరమైన పాలన) స్థాపిస్తారని యేసు ఎంతో వివరంగా చెప్పారు. యేసు చెప్పిన భవిష్యవాణి ప్రకారంగా మరియు యెహోవా అనేక లేఖనాలలో చేసిన వాగ్దానాన్ని బట్టి ఇష్మాయేలు వంశంలో ముహమ్మద్ చిట్టచివరి ప్రవక్తగా రావటం జరిగింది. యేసు చెప్పిన భవిష్యవాణి నెరవేర్పులో భాగంగానే ముహమ్మద్, యేసు బోధించిన సమస్త విషయాలను తిరిగి జ్ఞాపకం చేసి, ధర్మం పరిపూర్ణం గావించి, యేసు అభిలషించిన దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా స్థాపించారు. ఈ విషయాలన్నిటినీ వాక్యం వెలుగులో నిరూపిస్తూ వ్రాయబడిండే “వేరొక ఆదరణకర్త” పుస్తకం. ఉచితంగా Down Load చేసుకుని చదువగలరు.